జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్
- Jai Bharat National Party
- Mar 22, 2024
- 1 min read

ప్రజలతో మమేకం కండి: జైభారత్ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ
ప్రజలు ఎక్కడ ఉంటారో, అక్కడ జై భారత్ నేషనల్ పార్టీ సమన్వయకర్తలు, అభ్యర్థులు మమేకమై ఉండాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. అందరికన్నా భిన్నంగా జై భారత్ అభ్యర్థి నిలవాలని, రాత్రి పూట గ్రామాల్లో బస చేసి, ఉదయం స్వచ్ఛ భారత్ వంటి ప్రజాసేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ, ఓటర్లను అభ్యర్థించాలని కోరారు. జై భారత్ నేషనల్ పార్టీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్లు, ఇన్ ఛార్జుల సమావేశం విజయవాడ జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులతో పాటు, ఉపాధ్యక్షులు లంక కరుణాకర్ దాస్, ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు, రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్, ఎన్టీయార్ జిల్లా కోఆర్డినేటర్ వసుంధర తదితరులు పాల్గొన్నారు.
Comments