జై భారత్ నేషనల్ పార్టీ మా VMC సిబ్బందికి అండగా నిలుస్తుంది
- Jai Bharat National Party
- Jan 3, 2024
- 1 min read

ఈరోజు విజయవాడలో మున్సిపల్ కార్పోరేషన్ లో పని చేస్తున్న రోజు వారీ డ్రైవర్ లు, క్లీనర్ లు చేస్తున్న నిరవధిక సమ్మె కి మద్దతు పలికిన జై భారత్(N). ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు , కార్మికుల సమ్మె కి బహిరంగ మద్దతు తెలుపుతూ, ప్రభుత్వం ఇచ్చిన హామీ లు వెంటనే నెరవేర్చాలని, జై భారత్ (N) పార్టీ తరపున డిమాండ్ చేశారు, అలాగే తమ పార్టీ అధికారంలోకి వస్తే, మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడా నికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం నాయకులు, జై భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పోతిన రామారావు, పార్టీ నాయకులు వీరంసెట్టి సతీష్, అనగాని రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments