top of page
Search

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్(N) పార్టీ ఆధ్వర్యంలో, రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో మెగా ముగ్గుల పోటీ.

  • Writer: Jai Bharat National Party
    Jai Bharat National Party
  • Jan 15, 2024
  • 1 min read


జై భారత్(N) పార్టీ ఆధ్వర్యంలో, రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో మెగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీ కి భారీ ఎత్తున మహిళల నుండి స్పందన లభించింది. 1st, 2nd, 3d ప్రైజ్ లతో పాటు, భారీ గా 48 మందికి కన్సులేషన్ బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుమతులు ప్రధానం చేస్తున్నప్పుడు, జై భారత్ పార్టీ గురించి మరియు పార్టీ సిద్ధాంతాలు గురించి, అలాగే అధ్యక్షులు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారి ఆశయాల గురించి పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ కో ఆర్డినేటర్ శ్రీమతి కవిత, రాష్ట్ర కో ఆర్డినేటర్ మురళీ మోహన్ కుమార్ వీడియో కాల్ ద్వారా వివరించడం జరిగింది.

ఎల్. శ్రీదేవి -మొదటి బహుమతి

ఎస్. దుర్గ- ద్వితీయ బహుమతి

కె. వరలక్ష్మి -తృతీయ బహుమతి ని గెలుచుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాజమండ్రి సుబ్బారావు నగర్ మహిళలు, శ్రీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

రాబోయే రోజుల్లో పలువురు మహిళలు జై భారత్ పార్టీ లో చేరబోతున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము.

 
 
 

Comments


bottom of page