top of page

జై భారత్ నేషనల్ పార్టీ - జై భారత్ జై జై భారత్

Writer's picture: Jai Bharat National PartyJai Bharat National Party

ఎమ్మార్పిఎస్ నాయకులును గౌరవ పూర్వకముగా కలసిన జై భారత్ నేషనల్ పార్టీ మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి ఓర్సు రామారావు గారు.

ఈరోజు మైలవరం నియోజకవర్గంలో ని జి కొండూరులోని ఎమ్మార్పిఎస్ నాయకులును గౌరవ పూర్వకముగా కలసి వారి సూచనలను, సలహాలను తీసుకుంటున్న జై భారత్ నేషనల్ పార్టీ మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి ఓర్సు రామారావు గారు అందరూ ఐక్యంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో జై భారత్ నేషనల్ పార్టీ జెండా ఎగరేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ విజయానికి అందరూ ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని వారికి ఓర్సు రామారావు గారు సూచించారు. మాజీ ఐపిఎస్ అధికారి జె.డి.లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమం సాధ్యమన్నారు.

అవినీతికి వ్యతిరేకంగా జరగుతున్న పోరాటంలో దళిత, బిసి, ఎస్టీ, మైనారిటీలతో పాటు యువత, ఉద్యోగులు, గృహిణిలు అందరూ ఐక్యంగా జై భారత్ నేషనల్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు.

దళిత, బిసిల ఆత్మ గౌరవం కేవలం జై భారత్ నేషనల్ పార్టీతోనే సాధ్యమన్నారు.

1 view0 comments

Commentaires


bottom of page